Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెన్నైలో ఫ్లైఓవర్ పైనుండి పడిన బస్సు: ఒకరి మృతి
posted on: Jun 27, 2012 4:05PM
చెన్నైలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ బస్సు ప్రమాదం సంభవించింది. బ్రాడ్వే నుండి వడపళని వెళ్ళే సిటీ బస్సు (17ఎం. నెం.) జెమీనీ ఫ్లైఓవర్ మీదుగా వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు.
సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బస్సు నుంగంబాక్కం హైవే రోడ్డు వైపు ఫ్లైఓవర్ పైనుండి క్రిందికి దిగుతున్నప్పుడు బస్సు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు చెప్పారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


.png)



