బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్

posted on: Feb 22, 2012 4:04PM

హైదరాబాద్: మద్యం సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్ ఇచ్చింది. వారికి బెయిల్ మంజూరు చేయవద్దని ఎసిబి కోర్టుని కోరింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మద్యం వ్యాపారుల బెయిల్‌ పిటిషన్‌పై ఎసిబి తన వాదనలు వినిపించింది. సిండికేట్ల వ్యవహారంలో 15వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినందున నిందితులెవరికీ బెయిలు మంజూరు చేయరాదని కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. ఈ కుంభకోణంలో ఎక్సైజ్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు పోలీసుల ప్రమేయం ఉందని ఎసిబి కోర్టుకు వివరించింది. అందరి బండారం బయటపెట్టవలసి ఉందని ఎసిబి తన వాదనలో పేర్కొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...