Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యానాంఘర్షణలలో కార్మిక నేత,వైస్ఛైర్మన్ మృతి
posted on: Jan 27, 2012 6:24PM
యానాం:కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోని యానాంలోని రీజెన్సీ సిరామిక్ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇవి హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. కార్మిక సంఘ నేత మురళీమోహన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన కన్నుమూశారు. దీనికి నిరసనగా కార్మికులు యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. దీంతో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య హింస చెలరేగింది.ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ నాయకుడి మృతిని తట్టుకోలేక కార్మికుల ఫ్యాక్టరీ వైస్ ఛైర్మన్పై దాడి చేసి విధ్వంసానికి దిగారు. కంపెనీ బస్సులకు, లారీలకు నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది కార్మికులు గాయపడ్డారు. గత మూడు నెలలుగా రీజెన్సీ యాజమాన్యానికి కార్మికులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. జీతాల పెంపుదలను కోరుతూ పదిరోజులుగా వీరు రిలేనిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఇరువర్గాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు.కార్మికుల దాడిలో గాయపడ్డ రీజెన్సీ సిరామిక్ సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు కార్మికులు యానాంలోని రహదారులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. యానాంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాకినాడ నుంచి అదనపు పోలీసు బలగాలు యానాంకు తరలించారు.



.jpeg)


