కేవీపీకి ‘రెడ్‌కార్నర్’పై చేతులెత్తేసిన ఏఐసీసీ

 

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వుండగా వైఎస్సార్, కేవీపీ ఆధ్వర్యంలో జరిగిన టైటానియం కుంభకోణం విషయంలో అమెరికా కేవీపీ రామచంద్రరావుకు ‘రెడ్ కార్నర్’ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద త్వరలో కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కుంభకోణంతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా చేతులెత్తేసింది. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన స్పందనను తెలియజేసింది. ఈ విషయంలో అమెరికా స్పందిస్తున్న ఆరోపణలకు కేవీపీ రామచంద్రరావు వివరణలిచ్చుకోవాలని, దీనితో తమకెలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తెలియజేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు కేవీపీ రామచంద్రరావే వివరణలిచ్చుకోవాలి. ఈ కుంభకోణంలో ఆయన దోషిగా ఖరారైతే శిక్ష అనుభవించక తప్పదు అని ఆనంద్ శర్మ అన్నారు.