ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఎమ్మెల్యే కు కరోనా సోకడంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న 16మందికి టెస్టులు చేశారు. వారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

మరోవైపు ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సచివాలయంలో మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. అలాగే అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో సచివాలయం, అసెంబ్లీలలో కలిపి కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.