కాంగ్రెస్‌లో చేరిన తెరాస నేత రమేష్ రాథోడ్

 

ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి.. తెరాస నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డి రమేష్ రాథోడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న రమేష్ రాథోడ్‌కు తెరాసలో టికెట్ దక్కని విషయం తెలిసిందే.. ఖానాపూర్ టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు.. ఖానాపూర్ టిక్కెట్‌ను రేఖా నాయక్‌కు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న రమేష్ రాథోడ్.. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.