టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతా

వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైకాపాని వీడి టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్నా ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చిపడింది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం రామసుబ్బారెడ్డి నారా లోకేశ్.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసకుంటే తాను పార్టీనుండి వెళిపోతానని మొహం మీద చెప్పేశారు. అంతేకాదు తన కారణంగా టీడీపీకి చెందిన 150 కార్యకర్తలు చనిపోయారని అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారట. అయితే బాలకృష్ణ లోకేశ్ లు.. తమ ప్రతిపక్షనేత అయిన జగన్ సొంత జిల్లా నుండే పార్టీ నేతలు మన పార్టీలోకి రావడం మనకే ప్రయాజనం ఉంటుంది కదా అని ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి చూసిన తాను మాత్రం వెనక్కి తగ్గలేదట. దీంతో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఎంట్రీకి బ్రేక్ పడినట్టుయింది.