మాజీ జవానుకు ముగిసిన అంత్య క్రియలు.. కోటి నష్టపరిహారం..

 

ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై మనస్తాపం చెంది మాజీ జవాను రాంకింషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ రాంకింషన్ కు కోటి రూపాయలను నష్టపరిహారం ప్రకటించారు. ఈ పరిహారంతో పాటు, కుటుంబానికి ఉద్యోగ హామీని కూడా ఇస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు.   ఢిల్లీతో పాటు, ఇటు హర్యానా ప్రభుత్వం కూడా ఈ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది.