కేజ్రీవాల్ కు వర్మ ఫన్నీ ట్వీట్..

 

రాంగోపాల్ వర్మ ఈ మధ్య రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సెటైర్లు విసిరారు. ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా వర్మ కేజ్రీవాల్‌ పై ట్వీట్ చేశారు. హ్యాపీ చిల్డ్రన్స్‌ డే అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. దీంతో వర్మ ట్వీట్ పై నెటిజెన్లు స్పందించారు. ఇక ఎవరికి తోచిన విధంగా వారు జోకులు వేసుకుంటున్నారు. కేజ్రీవాల్‌ దేశంలోనే అతిపెద్ద కంప్లెయిన్‌ బాక్స్‌ అని, అందుకే ఆయనకు వర్మ చిల్డ్రన్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారని ఓ నెటిజెన్‌ స్పందించాడు. కేజ్రీవాల్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు చెప్పడం వర్మ మరిచాడా లేక కావాలనే వదిలేశాడా? అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరి ఇంకెన్ని జోకులు పేలుతాయో చూడాలి.