బీజేపీలో బ్రహ్మచారులు ఎక్కువ.. అందుకే ఈ నిర్ణయం..

 

ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనాన్ని అరికట్టే దిశలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుండి ఈ రోజు వరకూ ప్రతి పక్షాలు ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి యోగా గురువు రాందేవ్ బాబా కూడా చేరిపోయారు. నోట్ల రద్దుపై స్పందించిన ఆయన బీజేపీ నేతలపై విమర్సలు గుప్పించారు. భాజపాలో ఎక్కువ మంది పెళ్లి కాని ఉన్నారు.. అందుకే ఇది పెళ్ళిళ్ల సీజన్‌ అని వారు గ్రహించలేదు.. అదే తప్పు.. అని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల సీజన్ లో నోట్ల రద్దును ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని...  రాంగ్ టైమ్ లో నోట్లను రద్దు చేశారని కామెంట్లు విసిరారు. వివాహ సీజన్ లో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం తప్పేనని.. "ఇదే నిర్ణయాన్ని ఓ నెల రోజుల తరువాత ప్రకటించి వుంటే, పెళ్లిళ్లకు విఘాతం కలిగుండేది కాదు. అయినా ఇక్కడ ఓ మేలు కూడా జరిగింది. చాలా పెళ్లిళ్లు కట్నాలు లేకుండానే జరుగుతున్నాయి" అన్నారు.