రాజకీయాల్లోకి రాఖీ?

 

 

 

ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందాలను ఆరబోసే రాఖీ సావంత్ ఉన్నట్టుండి సమాజసేవికగా మారిపోయింది. శుభ్రత- పరిశుభ్రత అంటూ లెక్చర్లు ఇస్తోంది. అంతేకాదు, మురికివాడలకు కూడా వెళ్లిపోతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా పదివేల చెత్తబుట్టలు, కొన్ని బహుమతులు, తినుబండారాలు కొనుక్కుని మురికివాడలకు వెళ్లారు రాఖీ. అక్కడున్నవారికి వాటిని పంచిపెట్టింది. డస్ట్‌బిన్స్ పంచుతున్నప్పుడు అందరూ అందులోనే చెత్త వేయాలని, తద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, దానివల్ల రోగాల బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ లెక్చర్ కూడా ఇచ్చేసిందట. ఆమెకు రాజకీయాల్లో చేరాలని ఉందని, అందులో భాగంగానే ఇదంతా చేసిందని కూడా కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు.