హీరోయిన్ రేప్ కేసు... మంత్రి కొడుక్కి బెయిల్...

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కొడుకు కార్తీక్ గౌడ తనను పెళ్ళాడతానని మాయమాటలు చెప్పి తనను రేప్ చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ కేసు పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కన్నడ సినిమా రంగంతోపాటు దేశ రాజకీయాలలో కూడా ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. కార్తీక్ గౌడ మీద బెంగుళూరు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన నేపథ్యంలో కార్తీక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇదిలా వుంటే, కార్తీక్ గౌడ మీద ఫిర్యాదు చేసిన హీరోయిన్ మైత్రేయని పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. మైత్రేయ పెట్టిన కేసు పుణ్యామా అని కార్తీక్ గౌడకు జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోయింది.