తప్పులెన్ను వారు..

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్నఒక ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తను అధికారంలోకి రావడానికి దేశాన్ని చీల్చేందుకు కూడా వెనుకాడడని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ అన్నట్లు మోడీ అటువంటి ప్రయత్నాలు ఇంత వరకు చేయకపోయినా, తన తల్లి సోనియా గాంధీ తనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చిన సంగతి ఆయనకు బాగానే తెలుసు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఆ సంగతి మరిచి, మోడీని విమర్శించడం చూస్తే, నిత్యం నీతి సూక్తులు వల్లించే యువరాజావారికి కూడా కాంగ్రెస్ నీళ్ళు బాగానే ఒంటబట్టాయని అర్ధమవుతోంది.