ఆర్ కృష్ణయ్యకు పోలీసుల నోటీసులు..

 

నయీం కేసులో తెలంగాణ టీడీపీ నేత ఆర్ కృష్ణయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో భాగంగా.. విచారణకు హాజరు కావాలని నార్సింగి పోలీసులు ఆర్.కృష్ణయ్యకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల ప్రకారం.. కృష్ణయ్య విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటపాటు కృష్ణయ్యను ప్రశ్నించిన పోలీసులు కృష్ణయ్య స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు.