మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి

 

PV Ranga Rao is dead, PV Ranga Rao died, PV Ranga Rao dies

 

 

మాజీ మంత్రి పీవీ రంగారావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి గుండెపోటు రావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించారు. రంగారావు వయసు 73 సంవత్సరాలు. ఈయన దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి , కోట్ల విజయభాస్కరరెడ్డిల క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయారు. పీవీ నరసింహా రావు మృతి చెందాక ఆయనకు ఢిల్లీలో తగిన గౌరవం దక్కలేదని రంగారావు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ప్రధానుల్లా పీవీ సమాధికి ఢిల్లీలో తగిన గౌరవం కల్పించాలని ఎంతో ప్రయత్నిచారు.