పురంధేశ్వరి నామినేషన్

 

 

 

పాపం దగ్గుబాటి పురంధేశ్వరికి ఇప్పుడు కాణిపాకం గణపతి దిక్కయ్యాడు. తనకు ఎంతమాత్రం సంబంధం లేని, తనకు పోటీ చేయడం ఎంతమాత్రం ఇష్టం లేని రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇష్టం లేని, తనకు పూర్తిగా కొత్త అయిన రాజంపేట స్థానం నుంచి నామినేషన్ వేయడానికి ముందు పురంధేశ్వరి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయక దేవాలయానికి వెళ్ళి గణేషుడికి పూజలు నిర్వహించారు. తన తలకు మించిన రిస్క్ చేస్తున్న తనను నువ్వే కాపాడాలని కాణిపాకం గణపతికి పురంధేశ్వరి ప్రార్థించి వుంటారు.