బిజెపి ప్రచార కమిటీ కన్వీనర్‌గా పురందేశ్వరి

 

 

 

బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి నియమితులయ్యారు. పురంధేశ్వరిని పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా శనివారం ఉదయం బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు. ఈనెల 25 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో పొత్తులు ఉంటాయని ఆయన మీడియాతో అన్నారు. కాగా, పురంధేశ్వరి సీమాంద్రలో బిజెపికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూతురిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయం అని అంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిలు ఒకే వేదిక పంచుకోవాల్సి వుంటుంది.