జైరాం వ్యాఖ్యలను తప్పుపట్టిన పురంధేశ్వరి

 

 

 

కాంగ్రెస్ పార్టీ వీడి బిజెపిలో చేరడంపై మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఆమె బిజెపిలో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేదన్నారు. తాను కూడా ఎప్పుడు పార్టీ ప్రతిష్టను దిగజార్జలేదని అన్నారు. కృతజ్ఞత లేదంటూ తన పట్ల జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. రామాయపట్నం దగ్గర తనకు వెయ్యి ఎకరాలు ఉన్న మాట అవాస్తవమని పురందేశ్వరి తెలిపారు. తమకు ఎక్కడ ఏ భూములు ఉన్నాయో సర్వే నంబర్లతో జైరాం రమేష్ వెల్లడించాలని పురందేశ్యరి డిమాండ్ చేశారు. లోకసభలో బిల్లు పాస్ కాగానే తాను రాజీనామా చేశానని పురంధేశ్వరి గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే సీమాంధ్రకు న్యాయం జరగదన్నారు.విభజన తీరే కాదని, కాంగ్రెసు పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు.