సైనికుల‌తో మోడీ దివాళి సెల‌బ్రేష‌న్స్

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దీపావ‌ళిని ప్ర‌త్యేకంగా జ‌రుపుకున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కిన్నూర్ జిల్లాలో విధులు నిర్వ‌ర్తిస్తున్న సైనికుల‌తో ఆయ‌న దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. సిమ్లా నుంచి 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ్ దో ప్రాంతంలో ఇండో-టిబెటెన్ బోర్డ‌ర్ పోలీస్, డోగ్రా స్కౌట్స్, ఆర్మీ జ‌వాన్ల‌ను క‌లుసుకున్న ప్ర‌ధాని స్వ‌యంగా జ‌వాన్ల‌కు స్వీట్లు పెంచి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాని వెంట జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, ఆర్మీ చీఫ్ ద‌ల్బీర్ సింగ్ ఉన్నారు. అనంత‌రం చాంగో గ్రామంలో మ‌హిళ‌లు, చిన్నారుల‌తో మోడీ ముచ్చ‌టించారు.