విశాఖకు వచ్చిన నరేంద్ర మోడీ

 

భారత ప్రధాని నరేంద్రమోడీ హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు, స్థానిక ప్రజల్లో మనోధైర్యం నిపేందుకు మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు విశాఖపట్నం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తదితరులు స్వాగతం పలికారు. నరేంద్రమోడీ మొదట  తుఫాను ధాటికి తీవ్రంగా పాడైపోయిన విశాఖపట్నం విమానాశ్రయాన్ని పరిశీలించారు.