నోటిఫికేషన్ రిలీజ్: అంకెల్లో తెలంగాణ!

 

 

 

తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అంకెల్లో చూసుకుంటే..... ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల. ఈనెల 9వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం వుంటుంది. ఈ ఎన్నికలకు 336 మంది పరిశీలకులను నియమించారు. 138 వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థి 25 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి 10 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో సగమే చెల్లించాలి. పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థి 70 లక్షల వరకు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 28 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయొచ్చు. 10 జిల్లాల్లోని 119 అసెంబ్లీ స్థానాల్లో, 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మొత్తం 2,71,54,339 ఓటర్లున్నారు.