నడిరోడ్డుమీద కాంగ్రెస్ నేత హత్య

POLITICAL MURDER, PIDUGU R4ALLA, GUNTUR DISTRICT, JANAPADU LEADER, ASSOSINATION, NARENDRA MURDER, POLITICAL MURDER, FACES COVERED, CULPRITS ESCAPE

 

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ కాంగ్రెస్ నేతని రాజకీయ ప్రత్యర్ధులు నడిరోడ్డుమీద నరికి చంపారు. చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేంద్రని హెల్మెట్లు ధరించిన కొందరు దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.

 

చనిపోయిన నరేంద్ర స్వగ్రామం జానపాడు. జానపాడు రోడ్డులో నుంచున్నప్పుడే దాడి జరిగింది. ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఓ హోటల్లోకి పారిపోయే ప్రయత్నం చేశాడు. చుట్టూ కమ్మిన దుండగులు అతి దారుణంగా వేటకొడవళ్లతో మెడ నరికి చంపేశారు.

 

తీవ్రగాయాలపాలైన నరేంద్రని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఎమ్మెల్సీ జి.వి.కృష్ణారెడ్డి అనుచరుడిగా నరేంద్రకి మంచి గుర్తింపుంది. ఆయన సహకారంతోనే గ్రామంలో అభివృద్ధి పనులుకూడా చేస్తున్నారు. ఎదుగుదలని చూసి ఓర్వలేని కొందరు నరేంద్రని మట్టుపెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు.