కరెంట్ తీసేసి అరెస్టులు

 

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ కార్యదర్శి రాజాసదారాం తెలుగుదేశం పార్టీ సభ్యులతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో ఎమ్మెల్యేల అధికారిక అంగరక్షకులను బయటికి రప్పించి, శాసనసభ ఆవరణలో విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి, రాత్రి 11.15 నిముషాల సమయంలో పోలీసు బలగాలు, మార్షల్స్ తెలుగుదేశం పార్టీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, దూళిపాళ్ళ నరేంద్ర, సండ్ర వెంతకవీర్యయ్య పోలీసులను, మార్షల్స్ ను తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా వారిని అదుపులోకి తీసుకుని వీరిని ఒక వాహనంలో, మిగిలిన ఎమ్మెల్యేలను బస్సులో తరలించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన వద్ద వదిలిపెట్టారు. కొత్తకోట దయాకర్ తన వాహనంలో వారిని అనుసరించారు.