మోడీ వర్సెస్ మోడీ


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబైలో స్థానిక ఆజాద్ మైదాన్ లో జరిగిన చౌకధరల దుకాణదారుల ఉద్యమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత చౌకధరల దుకాణదారుల జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ ఉన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రాబోయే బీహార్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద దొంగలంటూ, రేషన్ డీలర్లు కూడా దొంగలుగా మారాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని ప్రహ్లాద్ మోదీ ఆరోపించారు. ఆయన ప్రసంగిచిన నలభై అయిదు నిమిషాలు తన సోదరుడు మోదీపై ఎలాంటి విమర్శలు లేకుండా చాలా చాకచక్యంగా మాట్లాడారు. తమ పోరాటం వ్యవస్థ మీదే కాని వ్యక్తుల మీద కాదన్నారు.