బ్యాంకులకు, ఏటీఎంలకు సెలవెందుకు..?

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే బుధ, గురువారాలు బ్యాంకులు, ఏటీఎం సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని అలా ప్రకటించారో లేదో జనమంతా తండోపతండాలుగా ఏటీఎంలకు పరిగెత్తారు. పాత నోట్లను రద్దు చేస్తున్నారు సరే..! మరి బ్యాంకులకు, ఏటీఎంలకు సెలవులెందుకు అని జనం చర్చించుకుంటున్నారు. అందుకు కారణం ఉంది. బ్యాంకులన్నీ తమ దగ్గరున్న పాత నోట్లను రిజర్వు బ్యాంకుకు అందజేసి..కొత్తవి తెచ్చుకోవటానికి, వాటిని ఏటీఎంలలో పెట్టడానికి వాటికి కొంత సమయం కావాలి. అందుకే ప్రభుత్వం బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది. ఏటీఎంలలో డబ్బు మార్చాలి కనుక..ఏటీఎంలు కూడా రెండు రోజులు పనిచేయవు.