త్రివిధ దళాధిపతులతో మోడీ సమావేశం

త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రత అంశంపై చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం సరిహద్దుల వద్ద తాజా పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే ఇటీవల చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.