ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు వివరించండి...


పెద్ద నోట్లపై పార్లమెంట్ లో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉభయ సభల్లో దీనిపై చర్చ జరపాలని.. ప్రధాని దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈరోజు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ చర్యలపై ప్రజల నుంచి సానుకూలత..పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలు పటిష్టంగా అమలయేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యక్తమవుతుందన్నారు. కొద్ది రోజుల్లో అన్ని సజావుగా సాగుతాయని.. మంత్రులంతా క్షేత్రస్తాయిలోకి వెళ్లి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని.. శని, ఆదివారాల్లో ఎంపీలంతా ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు వివరించాలని నిర్దేశించారు.