చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది...


పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దుపై చర్చ జరపాలని ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని.. సభను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించాలని చూస్తోందని విమర్శించారు. ప్రధాని సభకు కచ్చితంగా రావాలని ఎందుకు కోరుతున్నారని.. అవసరమైన సమయంలో ప్రధాని సభకు వచ్చి సమాధానం చెబుతారన్నారు.