బుల్లెట్ రైలులో మోడీ...

 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ రైలులో ప్ర‌యాణించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆ దేశ ప్ర‌ధాని షింజో అబే షింక‌న్‌స‌న్ బుల్లెట్ రైలులో రైడ్ చేశారు. టోక్యో నుంచి కోబ్ వ‌ర‌కు ఇద్ద‌రూ రైలులో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో  విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి వికాస్ స్వ‌రూప్ భార‌త్‌, జ‌పాన్ మ‌ధ్య బంధాలు ఫాస్ట్ ట్రాక్‌లో వెళ్తున్నాయ‌ని ట్వీట్ చేశారు. ఇక భార‌త్‌లో ముంబై నుంచి అహ్మాదాబాద్ మ‌ధ్య నిర్మిస్తున్న హై స్పీడ్ రైల్వే ట్రాక్‌ను జ‌పాన్ టెక్నాల‌జీతోనే నిర్మించ‌నున్నారు. అనంతరం మోడీ జ‌పాన్ చ‌క్ర‌వ‌ర్తి అఖిటోను కూడా ఇవాళ మోదీ క‌లుసుకోనున్నారు.