భారత్-జపాన్ మధ్య అణు ఒప్పందం...


ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అనంతరం ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం చరిత్రాత్మకమైనదని .. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్‌ అని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయన్నారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్‌ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమలక్ష్యమని స్పష్టం చేశారు.