ఫోన్ ట్యాపింగ్‌లపై రాష్ట్రపతికి ఫిర్యాదు

 

తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడడంపై ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రత్యేకించి పోన్ టాపింగ్,సెక్షన్ ఎనిమిది అమలు, తొమ్మిది, పది షెడ్యూల్ లలోని సంస్థల విభజన, తెలంగాణ ప్రభుత్వ వైఖరి మొదలైన వాటిపై రాష్ట్రపతికి మంత్రులు ఫిర్యాదు చేశారు. గరికపాటి రామ్మోహన్ రావు, సెబాస్టియన్‌ల ఫోన్లను ట్యాప్ చేశారని, దీనికి సంబంధించిన వివరాలను రాష్ర్టపతికి అందజేశామని తెలిపారు. తమ ఫిర్యాదులపై స్పందించిన రాష్ర్టపతి, కేంద్ర కేబినెట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ర్టాల సమస్యలను పరిష్కరిస్తామంటే తమకు ఎలాంటి అభ్యంతంర లేదన్నారు.