కొండగట్టు బస్సు ప్రమాదం.. హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

 

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 60 కి చేరింది.. ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇంతమందిని పొట్టనబెట్టుకోవడం నిజంగా దురదృష్టకరం.. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.. ఇప్పటికే డిపో మేనేజర్ ని సస్పెండ్ చేసినట్టు సమాచారం.. మరోవైపు ఈ ఘటనపై హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలైంది.. బస్సు ప్రమాదానికి బాధ్యులైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం అందేలా చూడాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.