పవన్‌ 'ఇజం' కి ‘సాక్షి’ చురకలు!

 

 

 

పవన్‌కళ్యాణ్ జగన్ మీద విరుచుకుపడటం, నరేంద్ర మోడీకి, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడ్డం చూసి జగన్ ఇంటి సంస్థ ‘సాక్షి’కి కోపం వచ్చేసింది. వెంటనే ‘సాక్షి’ పేపర్లో, ‘సాక్షి’ ఛానల్లో పవన్ కళ్యాణ్‌ని భారీ స్థాయిలో తిట్టడం ప్రారంభించింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద నోరు చేసుకోవడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ మీద అన్ని రకాలుగా మాటల దాడులు మొదలుపెట్టారు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ మూడు కళ్యాణాల గురించి ఘాటుగా విమర్శిస్తున్నారు. ‘సాక్షి’ ఛానెల్ పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంటే, ‘సాక్షి’ పేపర్లో ‘పచ్చబుట్టలో పవనిజం’ పేరుతో ఒక భారీ ఆర్టికల్ ప్రచురించారు. దీనిలో పవన్ మీద ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. గతంలో యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని ఎలా తిట్టిందీ ప్రస్తావిస్తూ, అప్పటి పేపర్ కటింగ్స్ కూడా మళ్ళీ ముద్రించారు. మొత్తంమీద ‘సాక్షి’ వ్యవహారం చూస్తుంటే పవన్ కళ్యాణ్‌ని ఊరికే వదిలేట్టు లేదు.