రాజు నీతి తప్పితే... నేల సారం తప్పుతుంది: పవన్

 

 

 

ప్రజలకు మంచి చేస్తారని రాజకీయ నాయకులను ఎన్నుకొంటె వాళ్ళు అవీనీతి, లంచగొండితనానికి అలవాటు పడి రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రోమన్ చక్రవర్తులు ఎంగిలి మెతుకులు విసిరినట్లు తెలుగు ప్రజలకు ప్యాకేజీలు విసిరారని ఆయన అన్నారు. కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. భారత జాతికి తూట్లు పొడిచారని ఆయన అన్నారు. 120 ఏళ్ల చరిత్ర అంటారు, ఇది కాంగ్రెసు చేసిన నిర్వాకమని అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లు దానికి తూట్లు పొడిస్తే మనకు ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అన్నారు. చట్టం అందరికీ సమానంగా పనిచేయడం లేదని అన్నారు.