గాంధీయిజం అన్ని సమస్యలకు మార్గం కాదు
posted on Nov 11, 2016 9:41AM
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజి గ్రౌండ్లో జరిగిన సీమాంధ్ర హక్కుల సభలో ప్రసంగించిన ఆయన ఇవాళ గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ నిరాహార దీక్షలతో అన్ని సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అలాగని ఆవేశ పడటం కూడా సమస్యలకు పరిష్కారం కాదు. గాంధీయిజం అంటే తనకు ఇష్టమేనని కానీ అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచించారు. తాను ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కు తగ్గలేనని, ప్రజల సమస్యలపై మాట్లాడతానని అన్నారు.