రెయిన్ గన్స్‌తో కరువు పోతుందా..?

అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీని టార్గెట్ చేసిన పవన్ అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చురకలు అంటించారు. మన వాటా మనకు ఇస్తే ఎలా తీసుకుంటారని..ఎలా సన్మానం చేస్తారని పవన్ చంద్రబాబును ప్రశ్నించారు. రెయిన్ గన్స్‌ వల్ల కరువు అంతరించిపోదని దానికి చాలా కృషి చేయాలని పవన్ అన్నారు.