జనసేన తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్

 

తెలంగాణ ముందస్తు వేడి జనసేనకు అంతగా తగిలినట్టు లేదు కానీ ఏపీలో మాత్రం ముందడుగు వేసి తొలి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల వేడి మొదలుపెట్టింది.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రకటించారు.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు పవన్ వెల్లడించారు.