పవన్ కళ్యాణ్ టీడీపీ దత్తపుత్రుడు అయితే మీకు అధికారమే లేదు :- టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

 

 

ఆదివారం ( నవంబర్ 3న ) విశాఖలోని మద్దిలపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనికి టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగసభలో అచ్చెన్న నాయుడు పాల్గొని ప్రసంగించారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు చేస్తోందని..టీడీపీ దత్తపుత్రుడు అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోంది.. ఇతర పార్టీలు నిర్వహించే కార్యక్రమాలను జరగకుండా చేయాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇసుక సంక్షోభం పై ఐదు నెలల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నామని.. అయినా వైసీపీ ప్రభుత్వానికి కానీ సీఎం జగన్‌కు కానీ చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎద్దేవా చేశారు.

ఇసుక కొరత వల్ల పనులు లేక మనోవేదనతో కొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే..సామాజిక మరణాలు అంటారా ? అంటూ వైసీపీ మంత్రులను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని టీడీపీ దత్తపుత్రుడు అంటారా ? ఆయన కలిసి ఉన్నప్పుడు జరిగింది ఇంకా మరిచిపోలేక ఇవ్వని మాట్లాడుతున్నట్లు ఉన్నారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన చూసి కూడా చలించకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వెంటనే ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరియు టీడీపీ పార్టీ జనసేనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా..ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా అన్ని పార్టీలు..ప్రజలు వ్యవహరించాలని సూచించారు.