కొత్తగా ఇచ్చింది ఏం లేదు..

 

అనంతపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనంతపురం అంటే నాకు చాలా ప్రేమ ఇష్టం.. 2014 ఎన్నికల సమయంలో అనంతకు వచ్చా.. అనంతపురం చాలా వెనుకబడిన జిల్లా అని అన్నారు. ప్రత్యేక హోదాపై  నిపుణులతో మాట్లాడా.. అందులో మనకు కొత్తగా ఇచ్చింది ఏం లేదు.. మనకు ఇవ్వాల్సిందే ఇచ్చారు అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మరోసారి వెంకయ్యనాయుడిపై విమర్సలు చేసినట్టు తెలుస్తోంది. వెంకయ్యనాయుడు, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ మంచిదని చెబుతున్నారు.. చట్టబద్దత లేని ప్యాకేజీలు ఇచ్చి సన్మానాలు చేయించుకున్నారు అని ఎద్దేవ చేశారు.