అనంత చేరుకున్న పవన్.. కొద్ది సేపట్లో సభ ప్రారంభం..

 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురంలో ఈరోజు బహిరంగ సభలో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. సభ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కాగా అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన‌ వేదికపై ఆయ‌న దాదాపు గంట‌న్న‌ర స‌మ‌యం ప్ర‌సంగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.