పవన్ ఓటు సందేశం: సినిమా టిక్కెట్ల కోసం నిల్చుంటాం కానీ...


సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబిలీహిల్స్ లోని గాయత్రి హిల్స్ పోలింగ్ కేంద్రంలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం మంచిది కాదని అన్నారు. మనకి ఇష్టమైన సినిమా చూడాలన్న ఉద్దేశంతో టిక్కెట్ల కోసం గంటలు గంటలు క్యూలో నిల్చుంటాం. మన భవిష్యత్తుని నిర్ణయించే ఓటు వేయడానికి మాత్రం బద్ధకిస్తాం. ఇది మంచి పద్ధతి కాదని, అందరూ తమ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలని అన్నారు.