నేటి నుండి పవన్ ఆంధ్రాలో ప్రచారం

 

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఇప్పుడు సీమాంధ్ర దారి పట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గుంటూరులో నరసరావుపేట, చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇంతవరకు కేసీఆర్ పై తన బాణాలు ఎక్కుపెట్టిన పవన్, ఇకపై జగన్మోహన్ రెడ్డిపై బాణాలు సందించడం ఖాయం. అదేవిధంగా ఇంతవరకు ఆయనపై కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎదురు దాడి చేయగా ఇకపై జగన్, విజయమ్మ, షర్మిలా ఎదురుదాడి చేయవచ్చును. నరేంద్ర మోడీ ఇంకా ప్రచారానికి రాక మునుపే జగన్మోహన్ రెడ్డిపై కటిన చర్యలు తప్పవని హెచ్చరించినందున, ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నపవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగానే విమర్శలు చేయవచ్చును. పవన్ కళ్యాణ్ ప్రచారంతో తెలంగాణాలో తెదేపా-బీజేపీ అభ్యర్ధులు బలం పుంజుకొన్నట్లుగానే, సీమంద్రాలో కూడా వారి అభ్యర్ధులు బలం పుంజుకోవచ్చును. ఇక ఇంతవరకు ఆంధ్రాలో చిరంజీవి ఒక్కరే ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రవేశిస్తుండటంతో ప్రచారపర్వం ఆసక్తికరంగా మారనుంది.