కడుపు మండే రాజకీయాలలోకి వచ్చాను: పవన్

 

కాంగ్రెస్ పార్టీ పల్లకీని తెలుగు ప్రజలు భుజాలు ఒరిసిపోయేలా మోస్తే వారు తెలుగు ప్రజలను చీల్చి, భారత జాతి సమగ్రతను కూడా చెడగొట్టారు. పైగా పదే పదే 150 సం.ల చరిత్ర గల పార్టీ మాదని చెప్పుకోవడం మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంది. తెలుగు ప్రజలందరూ ఒక్కసారి చ్చీ కొడితే కాంగ్రెస్ పార్టీ కనబడకుండా కొట్టుకుపోతుంది. నేను కడుపు మండి రాజకీయాలలోకి వచ్చెను. ప్రజలను దోచుకొంటున్న రాజకీయ నాయకులను చూసి రాజకీయ లలోకి వచ్చెను. కుళ్ళిపోతున్న ఈ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఇంట్లో పళ్ళు కొరుకు కొంటూ కూర్చోకుండా సమాజం పట్ల నా వంతు బాధ్యతని నిర్వహించెందుకే జనసేన పార్టీని పెట్టాను. అందుకే ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను దాని మూలాల నుండి క్రూల దోయాలి. అందుకు బలమయిన సిద్ధాంతాలు కావాలి. అనేక పుస్తాకాలను చదివి, నాకు అన్ని విధాలా తృప్తి కలిగించిన సిద్దాంతామే ఈ ఇజం..జనసేన పార్టీ సిద్దాంతం. నేను వ్రాసుకొన్న ఈ ఇజం పుస్తకాన్ని యావత్ ప్రజలకు అంకితం ఇస్తున్నాను.