పవన్ అభిమానులపై 'లాఠీచార్జ్'

 

 

 

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఆవిర్భావ సభకు పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో తరలీవచ్చారు. కేవలం నాలుగు వేల మందికే పాస్ లు జారీ చేయడంతో..మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు. తమ అభిమాన నటుడు నెలకొల్పనున్న రాజకీయపార్టీ ఆవిర్భావ సభను ప్రత్యక్షంగా చూద్దామని వచ్చిన కొంతమంది అభిమానులు పాస్ లు లేక బయటే నిరాశతో నిలిచిపోయారు.  పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.