జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

 

 

 

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసమే రాష్ట్ర విభజన జరిగిందని ప్రముఖ నటుడు,జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు దెబ్బతీశారని మండిపడ్డారు. సీమాంద్రులను కేసీఆర్ పదే పదే విమర్శిస్తూ, తిడుతుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు జగన్‌కు గొంతు పెగలలేదని అన్నారు. సీమాంద్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయగల సత్తా ఒక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకే ఉందని పవన్ కల్యాణ్ ఉద్ఘటించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేదిలేదని, చీల్చిచెండాడతామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ హఠావో... సీమాంధ్ర బచావో అంటూ పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.