ప్లేట్లు ప‌ట్టుకొని విప‌క్షాల నిరసన...


పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రధాని మోడీ చర్చ జరపాలని.. స్పష్టత ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద చేతిలో ప్లేట్లు ప‌ట్టుకొని విప‌క్షాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పుడు ఏం తినాలి.. ఏటీఎం కార్డుల‌ను తింటారా? భారతదేశాన్ని మొత్తం క్యూలో నిలబెట్టారని, ప్ర‌తి ఒక్క‌రినీ బిక్ష‌గాళ్లలా మార్చారంటూ చేతిలో ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో మొత్తం క‌ష్టాలేన‌ని, వ‌చ్చేదేమీలేద‌ని నినాదాలు చేస్తున్నారు.