ప్లేట్లు పట్టుకొని విపక్షాల నిరసన...
posted on Nov 18, 2016 11:30AM
పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రధాని మోడీ చర్చ జరపాలని.. స్పష్టత ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేతిలో ప్లేట్లు పట్టుకొని విపక్షాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పుడు ఏం తినాలి.. ఏటీఎం కార్డులను తింటారా? భారతదేశాన్ని మొత్తం క్యూలో నిలబెట్టారని, ప్రతి ఒక్కరినీ బిక్షగాళ్లలా మార్చారంటూ చేతిలో ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో మొత్తం కష్టాలేనని, వచ్చేదేమీలేదని నినాదాలు చేస్తున్నారు.