రెండో రోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...

 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా పెద్ద నోట్ల రద్దుపై ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలకు దిగారు. ఇక రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపాలని విపక్షాలు ఆందోళనలకు దిగడంతో సభను 20నిమిషాల పాటు వాయిదా వేశారు.