ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డ లోక్‌సభ

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. జాతీయ గీతం అనంతరం ప్రారంభమైన సమావేశంలో ఇటీవల మరణించిన దివంగత ఎంపీలకు పార్లమెంట్ నివాళుర్పించింది.  ఈ సందర్భంగా దివంగత రేణుకా సిన్హా, థాయ్‌లాండ్ రాజు భుమిభల్ అద్యులతేజ్ తదితరులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు.