పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద తృణమూల్ ఆందోళన

రూ.500, రూ.1000 రూపాయల నోట్లు రద్దు చేయడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్..పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీపై ఆందోళనకు సిద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో తలెత్తిన ఆర్థిక ఎమెర్జెన్సీని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ ఎంపీలు పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నల్లశాలువాలు ధరించి ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.