యాన్టిసిపేటరీ బెయిల్ కోసం పరిటాల శ్రీరామ్ పిటిషన్

 

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్ నేత సుధాకర్ పై గత వారం జరిగిన హత్య ప్రయత్నంలో పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు పరిటాల సునీతా కుమారుడయిన పరిటాల శ్రీరామ్ పేరును కూడా జేర్చడంతో, అతను గత మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు శాసన సభ్యురాలు పరిటాల సునీత మరియు వారి బందువుల ఇళ్ళలో కూడా సోదా చేయడం వివాదాలకు తావిచ్చింది. అయితే, పరిటాల శ్రీరామ్ కోర్టులో లొంగి పోబోతున్నట్లు అనంతపురంలో జోరుగా పుకార్లు ప్రచారం అవడంతో, మీడియా అక్కడికి జేరుకొంది. ఆ వార్త తెలిసిన పరిటాల శ్రీరామ్ సానుభూతిపరులు కూడా పెద్దఎత్తున హడావుడిగా కోర్టువద్దకు జేరుకోవడంతో ఒక్కసారిగా కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలఎత్తాయి. గానీ, కోర్టు మూసేసే సమయానికి కొద్ది నిమిషాల ముందు పరిటాల శ్రీరామ్ కు బదులు, అతని లాయర్ వచ్చి కోర్టులోఅతని తరపున యాన్టిసిపేటరీ బెయిలు పిటిషను దాఖలు చేసారు. కోర్టు ఆ పిటిషన్ పై విచారణ ఈరోజు చేపట్టవచ్చునని సమాచారం.